News March 29, 2025

శ్రీవారి సేవలో శాసనమండలి ఛైర్మన్

image

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, సిపాయి సుబ్రమణ్యంలతో కలిసి రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి దర్శించుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించి, ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

Similar News

News April 2, 2025

పోలీసులతో బెదిరించినా తెగువ చూపారు.. హ్యాట్సాఫ్: YS జగన్

image

AP: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు అధికార అహంకారంతో ఎలాగైనా గెలవాలని చూశారని YCP అధినేత జగన్ అన్నారు. ‘రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని నేను. ఉప ఎన్నికల్లో మన కార్యకర్తలు చూపిన తెగువ, ధైర్యానికి హ్యాట్సాఫ్. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు గెలిచాం. TDPకి సంఖ్యా బలం లేకున్నా పోలీసులతో బెదిరించారు’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో వ్యాఖ్యానించారు.

News April 2, 2025

స్టూడెంట్ తండ్రికి టీచర్ ముద్దులు.. చివరకు..

image

బెంగళూరులో శ్రీదేవి అనే ప్రీ స్కూల్ టీచర్ ఓ విద్యార్థిని తండ్రిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసింది. తొలుత అతడి వద్ద నుంచి రూ.4లక్షలు అప్పుగా తీసుకున్న ఆమె, ఆ తర్వాత అతడితో ఏకాంతంగా గడిపింది. అతడికి ముద్దు పెట్టిన ఫొటోలు, వీడియో చాట్‌లను బయటపెడతానంటూ విడతల వారీగా డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో చివరకు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు శ్రీదేవి, ఆమె ప్రియుడు సాగర్, రౌడీ షీటర్ గణేశ్‌‌ను అరెస్ట్ చేశారు.

News April 2, 2025

శుభకార్యాల వేళ హిజ్రాల దోపిడీని అరికట్టేదెలా?

image

హైదరాబాద్‌లో హిజ్రాల దోపిడీ పెరిగిపోయింది. ఫంక్షన్ ఏదైనా ఇంట్లోకి వచ్చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ బంధువుల ముందు పరువు తీస్తున్నారని నగరవాసులు SMలో వాపోతున్నారు. తాజాగా కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో పూజ జరుగుతుండగా అక్కడికి వచ్చి రూ.8వేలు వసూలు చేశారు. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి తమ సంతకం చేసి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులందినా, చర్యలు లేవని నెట్టింట విమర్శలొస్తున్నాయి.

error: Content is protected !!