News February 25, 2025
శ్రీశైల మల్లన్న సన్నిధికి చేరిన అమరచింత పట్టు వస్త్రాలు

మహాశివరాత్రి పురస్కరించుకొని అమరచింత పద్మశాలీలు శ్రీశైల మల్లన్న సన్నిధిలో పది రోజులపాటు నియమ నిష్టలతో స్వామికి పట్టు వస్త్రాలు నేశారు. పది రోజులపాటు నియమ నిష్ఠలతో నేసిన ఈ పట్టు వస్త్రాలను అమరచింత మహంకాళి శ్రీనివాసులు కవితా రాణి దంపతులు తలపై పట్టు వస్త్రాలను పెట్టుకుని శ్రీశైల మల్లన్నకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి సత్యనారాయణ ఎల్లప్ప కడుదాస్ సిద్ధమ్మ పాల్గొన్నారు.
Similar News
News February 25, 2025
సిద్దిపేట: ఏడుపాయల జాతరకు భారీగా బస్సులు

ఏడుపాయల జాతరకు భారీగా ఆర్టీసీ బస్సులను అధికారులు నడపనున్నారు. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి 300 బస్సులు, పటాన్చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
News February 25, 2025
విజయవాడ : నేడు పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ను ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వంశీని పోలీస్ కస్టడీలో విచారించనున్నారు. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ పై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కోర్టులో హాజరు పరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది.
News February 25, 2025
సంగారెడ్డి: ఏడుపాయల జాతరకు భారీగా బస్సులు

ఏడుపాయల జాతరకు భారీగా ఆర్టీసీ బస్సులను అధికారులు నడపనున్నారు. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి 300 బస్సులు, పటాన్చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.