News March 25, 2025

శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు: ఎస్పీ

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో జరగనున్న ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మంగళవారం తెలిపారు. ప్రత్యేకించి క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Similar News

News March 29, 2025

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి: కలెక్టర్

image

గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో రైతు బాలమద్దిలేటి దేశీ విత్తనాలతో వేసిన ప్రకృతి వ్యవసాయ వరి పొలాన్ని కలెక్టర్ రాజకుమారి శనివారం సందర్శించారు. రైతును పంట వివరాలు అడిగి తెలుసుకుని, దేశీ వరి పండిస్తున్నందుకు ఆయనను అభినదించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వారితో పాటు డీఏవో మురళీ కృష్ణ, ఏడీఏ పాల్గొన్నారు.

News March 29, 2025

సోమవారం PGRS కార్యక్రమం రద్దు: కలెక్టర్ 

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక’ కార్యక్రమాన్ని ఈ నెల తేదీ 31న సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఆ రోజు రంజాన్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించార.  

News March 29, 2025

ఆదిలాబాద్: స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి

image

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన SC విద్యార్థులకు 2025 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య నిధి” పథకం ద్వారా స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని SC సంక్షేమ శాఖ అధికారి సునీత పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి మే 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 88869 76630 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

error: Content is protected !!