News February 25, 2025

శ్రీశైలంలో శివరాత్రి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

image

శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి భద్రతా ఏర్పాట్లను కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ పరిశీలించారు. నంద్యాల ఇన్‌ఛార్జి ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి క్షేత్ర పరిధిలో పర్యటించారు. దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. సీసీ టీవీల కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Similar News

News February 26, 2025

జనగామ: పోలీస్ ఎస్కార్ట్‌తో పరీక్ష పేపర్లను తరలించాలి: కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బషా షేక్ 10వ తరగతి పరీక్షలపై సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు తాగునీరు, మూత్రశాలల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలీస్ ఎస్కార్ట్‌తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష పేపర్లను తరలించాలని అధికారులకు సూచించారు.

News February 26, 2025

మహబూబాబాద్: అధికారులతో కలెక్టర్ సమీక్ష 

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బందితో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ మంగళవారం ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న ఉ.8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రభుత్వ, ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు పక్కాగా అమలు చేస్తూ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.

News February 26, 2025

సంగారెడ్డి: విద్యుత్ కాంతుల్లో కాశీ విశ్వేశ్వర ఆలయం

image

కాకతీయుల కాలంలో నిర్మించిన సంగారెడ్డి మండలం కల్పగురు గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. 26వ తేదీన ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!