News March 30, 2025

సంగారెడ్డి: 115 ఏళ్ల వృద్ధురాలు మృతి

image

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బోరంచ గ్రామానికి చెందిన బైండ్ల నాగమ్మ శతాధిక వృద్ధురాలు మరణించారు. ఆమె వయసు 115. ఇప్పట్లో ఇన్నేళ్లు బతకడం చాలా కష్టమని ప్రజలు చెప్పుకుంటున్నారు. అప్పటి వారు చాల గట్టి మనుషులని, ఇప్పటి తరం వారు చిన్న చిన్న వ్యాధులతో మృతి చెందుతున్నారని చెప్పారు. ఇంతకాలం బతకడం అదృష్టమని వివరించారు.

Similar News

News April 2, 2025

దేవాదాయ శాఖ కమిషనర్‌ను కలిసిన జిల్లా కలెక్టర్

image

భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం జిల్లాకు వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలిసి స్వాగతం పలికారు. కళ్యాణం పట్టాభిషేకం మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్‌ను దేవదాయ శాఖ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.

News April 2, 2025

ప్రపంచానికే సాయం.. భారత్ విపత్తు దౌత్యం

image

ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే విపత్తు సంభవించిందంటే మొట్ట మొదటిగా భారతే స్పందిస్తుంది. 1959లో టిబెట్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడం నుంచి నిన్న మొన్నటి మయన్మార్‌ భూకంపంలో ‘ఆపరేషన్ బ్రహ్మ’ వరకు భారత్ చేసిన సాయం అంతాఇంతా కాదు. దీన్ని ‘విపత్తు దౌత్యం’గా విదేశీ వ్యవహారాల నిపుణులు వివరిస్తున్నారు. సాధారణ దౌత్యంతో కుదరని బలమైన సంబంధాల్ని ఈ దారిలో భారత్ సాధిస్తోందని కొనియాడుతున్నారు.

News April 2, 2025

కరోనా బారినపడ్డ పాక్ అధ్యక్షుడు

image

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను కరాచీలోని ఓ ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉంచారు. జర్దారీ జ్వరంతో పాటు శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కరోనా నిర్ధారణకు ముందు ఆయన ఈద్ ప్రార్థనల్లో పాల్గొనడంతో పాటు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!