News March 30, 2025

సంగారెడ్డి: 25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో 2020వ సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్‌ల యజమానులందరూ ఈ నెల 31లోగా పూర్తి ఫీజు చెల్లించి 25% రాయితీని పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. 25% రాయితీ గడువు రేపటితో ముగుస్తుందని ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News April 2, 2025

‘పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు కృషి చేయాలి’

image

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం ఐడిఓసిలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలకు అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

News April 2, 2025

నారాయణపేట: ‘ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజం’

image

ఉద్యోగులుగా విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన రాజా రామ్ ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో రాజా రామ్ దంపతులకు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో చేసిన సేవలను కొనియాడారు. శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, ప్రజా సేవ చేయాలని కోరారు. సిబ్బంది పాల్గొన్నారు.

News April 2, 2025

వరంగల్ మార్కెట్లో ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటా ధర రూ.28వేలు, సింగిల్ పట్టికి రూ.28,011 పలికింది. దీపిక మిర్చి క్వింటా ధర రూ.12,500, 1048 రకం మిర్చికి రూ.10వేలు, 5531 మిర్చికి రూ.9వేలు పలికినట్లు వ్యాపారులు తెలిపారు. .

error: Content is protected !!