News February 26, 2025
సంగారెడ్డి: 26, 27న ఆ విద్యా సంస్థలకు సెలవు

పోలీస్ కేంద్రాలు ఉన్న పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 26, 27న సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. 26న ఈనెల ఎన్నికల ఏర్పాట్లకు, 27న పోలింగ్ కోసం పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధానోపా ధ్యాయులు, ప్రిన్సిపల్స్ గమనించాలని కోరారు.
Similar News
News February 26, 2025
బాలీవుడ్ నటుడి విడాకుల వార్తలపై క్లారిటీ

బాలీవుడ్ నటుడు గోవింద విడాకులు తీసుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన సన్నిహితులు స్పందించారు. భార్య సునీతతో గోవిందకు అభిప్రాయభేదాలు ఉన్నాయని, అయితే అవి విడాకులు తీసుకునేంత పెద్దవి కాదని ఆయన మేనేజర్ చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విడాకుల వార్తలన్నీ అవాస్తవమని గోవింద మేనకోడలు ఆర్తిసింగ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు.
News February 26, 2025
కృష్ణా జిల్లా ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు: ఎస్పీ

కృష్ణా జిల్లా ప్రజలందరికీ, పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ఆర్. గంగాధర రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లా పోలీస్ శాఖ తరఫున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులందరి సమక్షంలో సంతోషం జరుపుకోవాలని ఆయన కోరుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
News February 26, 2025
HYDలో ప్రసిద్ధ శివాలయాలు ఇవే..!

మన జిల్లాలో ప్రసిద్ధ శివాలయాలు. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజు 6వ విక్రమాదిత్యుడు శంకర్పల్లిలో మరకత లింగాన్ని ప్రతిష్ఠించారని శాసనం చెబుతోంది. జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన వైద్యనాథుడిని పోలి..ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. త్రేతాయుగంలో 101 లింగాలను కాశీ నుంచి ఆంజనేయుడు తీసుకురాగా..రాముడు కీసరలో ప్రతిష్ఠించాడు. షాద్నగర్ సమీపంలోని రాయకల్లో శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.