News March 6, 2025
సంగారెడ్డి: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.
Similar News
News March 6, 2025
సిద్దిపేట్: ఇంటర్ విద్యార్థులారా.. ఇది మీ కోసమే..!

ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఖాళీ కడుపుతో రాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలైన ఇడ్లీ లేదా చద్దన్నం లాంటివి తిని రావాలని సిద్దిపేట జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా నీరు తాగుతుండాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సెంటర్లో అందుబాటులో ఉండే హెల్త్ అసిస్టెంట్లను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కనీసం 8గంటల నిద్ర ఉండాలన్నారు.
News March 6, 2025
‘ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి’

బాపట్ల జిల్లా ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక జరిగినట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొత్తపల్లి రమేష్ తెలిపారు. ఈ మేరకు నూతనంగా ఎంపికైన జిల్లా కార్యవర్గ సభ్యులతో కలెక్టర్ వెంకట మురళిని గురువారం బాపట్లలో మర్యాదపూర్వకంగా కలిశారు. రమేశ్ మాట్లాడుతూ.. మీడియా రంగంలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
News March 6, 2025
IPL ఫ్యాన్స్కు అలర్ట్.. రేపటి నుంచే టికెట్ బుకింగ్స్

‘IPL-2025’ టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈక్రమంలో హైదరాబాద్లో జరిగే తొలి రెండు మ్యాచులకు సంబంధించిన టికెట్లను రేపటి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు SRH ప్రకటించింది. 23న SRHvsRR, 27న SRHvsLSG మ్యాచ్లు జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. రెండు టికెట్లకు ఒక జెర్సీ ఫ్రీగా ఇస్తారు.