News March 11, 2025

సంగారెడ్డి: ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

image

8 మంది విద్యార్థులను అకారణంగా కొట్టినందుకు కంగ్టి కస్తూర్బా పాఠశాల నుంచి ఇద్దరిని విధుల నుంచి తొలగిస్తు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గణితం సీఆర్పీ సురేఖ, పీఈటీ రేణుకను విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థులను కొడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 11, 2025

ATP: అన్ని అంశాల్లో జిల్లా టాప్ – 6లో ఉండాలి- కలెక్టర్

image

పంచాయతీ సెక్టర్, GSWS తదితర అంశాలలో అనంతపురం జిల్లా టాప్ – 6లో ఉండేందుకు అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పలు శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. MSME సర్వేలో పురోగతి తీసుకొచ్చి 24 గంటల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 11, 2025

KCRను కలిసిన దాసోజు శ్రవణ్

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తనకు MLCగా అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు దాసోజుకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.

News March 11, 2025

రేపు 1532మందికి ఉద్యోగ నియామక పత్రాలు

image

TG: జూనియర్ లెక్చరర్(1292మంది), పాలిటెక్నిక్ లెక్చరర్(240మంది) ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రేపు నియామక పత్రాల్ని అందించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. కొత్తగా కొలువుల్లోకి చేరే ఈ సిబ్బందికి విద్యాశాఖ విధానాలు, బోధనాపద్ధతులపై ట్రైనింగ్ అనంతరం పోస్టింగ్స్ ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు.

error: Content is protected !!