News February 22, 2025
సంగారెడ్డి: ఈనెల 24న పదో తరగతి పరీక్షలపై శిక్షణ

మార్చి నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ఎంఈవోలకు, రూట్ ఆఫీసర్లకు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంటెంట్, డిపార్ట్మెంట్లకు ఈనెల 24న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ శిక్షణలో జిల్లా కలెక్టర్ పాల్గొంటారని చెప్పారు.
Similar News
News February 23, 2025
పెద్దపల్లి: రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు

పెద్దపల్లి కలెక్టరేట్లో ఫిబ్రవరి 24న సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికారులు అందరూ ఎన్నికల విధుల్లో క్షేత్రస్థాయిలో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
News February 23, 2025
టన్నెల్లో బయటపడ్డ కార్మికుడి చెయ్యి

TG: ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వారి ఆచూకీని సహాయక బృందాలు కనుగొన్నాయి. టన్నెల్లో 14వ కి.మీ వద్ద మట్టి దిబ్బల్లో ఓ కార్మికుడి చేయి బయటపడింది. దీంతో లోపల చిక్కుకుపోయిన 8 మందిలో ఎంత మంది ప్రాణాలతో ఉన్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా బురదలో కూరుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రెస్క్యూను ముమ్మరం చేశాయి.
News February 23, 2025
బీజేపీ అభ్యర్థులను గెలిపించండి : ADB MP

ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు చిన్నమయల్ అంజిరెడ్డి, కొమురయ్యను గెలిపించాలని ADB ఎంపీ గోడెం నగేష్ అన్నారు. శనివారం మామడ మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు రంజిత్ కుమార్, నాయకులు చందు, నారాయణ రెడ్డి, బాపురెడ్డి, రాజారెడ్డి, నవీన్, గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.