News February 26, 2025

సంగారెడ్డి: ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార గడువు ముగిసినందున జిల్లాలో ఎక్కడైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా పార్టీ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. బల్క్ ఎస్ఎంఎస్‌లు కూడా పంపవద్దని అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 26, 2025

చరిత్ర సృష్టించిన అఫ్గాన్ ప్లేయర్ జద్రాన్

image

అఫ్గానిస్థాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ చరిత్ర సృష్టించారు. వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేసిన ఏకైక అఫ్గాన్ ఆటగాడిగా ఆయన నిలిచారు. WCలో ఆస్ట్రేలియాపై, CTలో ఇంగ్లండ్‌పై శతకాలు బాదారు. మరే అఫ్గాన్ ప్లేయర్ ఈ రెండు మెగా టోర్నీల్లో శతకాలు బాదలేదు. కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో జద్రాన్ (177) సెంచరీతో మెరిశారు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నారు.

News February 26, 2025

మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 66,240 కూలీల ఖాతాల్లో ప్రభుత్వం రూ.6000 చొప్పున జమ చేసింది. ఇప్పటివరకు మొత్తం 83,420 మందికి రూ.50.65 కోట్లు జమ చేశామంది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా నిధులను చెల్లిస్తామంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 18,231 మందికి జమ చేసినట్లు వెల్లడించింది. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా? కామెంట్ చేయండి.

News February 26, 2025

కోనసీమ మోనాలిసా అంటూ పోస్టింగ్.. కేసు నమోదు

image

మైనర్ బాలికపై ఇంస్టాగ్రామ్‌లో పోస్టింగ్ పెట్టి ఆమెను మనస్తాపానికి గురిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ జ్వాలాసాగర్ బుధవారం తెలిపారు. సిహెచ్ గున్నేపల్లి సత్తెమ్మ తల్లి తీర్థంలో అమలాపురానికి చెందిన మైనర్ బాలిక పూసలు అమ్ముకుంటుందన్నారు. అమలాపురం చింతాడ గరువుకు చెందిన దేవిశ్రీప్రసాద్ వీడియోలు తీసి ఇంస్టాగ్రామ్‌లో కోనసీమ మోనాలిసా అంటూ పోస్టింగ్ చేశాడన్నారు. దీనిపై బాలిక పినతల్లి ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!