News March 10, 2025
సంగారెడ్డి: కడుపునొప్పితో వివాహిత సూసైడ్

కడుపునొప్పి భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. SI రంజిత్ రెడ్డి వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మం. మర్పెల్లికి చెందిన మహేశ్వరి(27)కి కౌడిపల్లి మం. మహమ్మద్నగర్కు చెందిన అనిల్తో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. కొడుకు పుట్టినప్పటి నుంచి మహేశ్వరి కడుపునొప్పితో బాధపడుతుంది. పలుచోట్ల చికిత్స చేయించినా తగ్గలేదు. మనస్తాపం చెందిన ఆమె నిన్న ఇంట్లో ఉరేసుకుంది. మహేశ్వరి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News March 10, 2025
మెదక్: పరీక్షకు 5,529 విద్యార్థులు హాజరు

ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లీష్ సెకండ్ పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 5,640 విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 5,529 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 111 మంది వివిధ కారణాల వల్ల హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
News March 10, 2025
చట్ట పరిధిలో సమస్యల పరిష్కరించాలి: ఎస్పీ

పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను చట్టపరిధిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డుడి చెప్పారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 89 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఎస్పీ నేరుగా అర్జీలను స్వీకరించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
News March 10, 2025
NZB: సీపీగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఇటీవల నిజామాబాద్కు బదిలీ చేశారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో సీపీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన కల్మేశ్వర్ హైదరాబాద్కు బదిలీ కాగా, కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐదు నెలల అనంతరం జిల్లాకు నూతన పోలీస్ బాస్ వచ్చారు.