News April 3, 2025

సంగారెడ్డి జిల్లాలో కుళ్లిన శవం లభ్యం

image

సంగారెడ్డి జిల్లాలో కుళ్లిపోయిన శవం కలకలం రేపుతోంది. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ శివారులో గురువారం గుర్తుతెలియని వ్యక్తి శవం దొరికిందని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. గుర్తుపట్టలేకుండా మృతదేహం కుళ్లిపోయిందని, అతడి వయసు 30- 40 ఏళ్లు మధ్య ఉండి, పైన బ్లూ కలర్ డ్రాయర్ ఉందన్నారు. మృతుడి గురించి ఎవరికైనా తెలిస్తే ఇంద్రకరణ్ ఎస్ఐ నంబర్ 8712656747, సంగారెడ్డి రూరల్ సీఐ నంబర్ 87126 56719 కు సంప్రదించాలన్నారు.

Similar News

News April 10, 2025

HYD: నేడు HCUకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ

image

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నేడు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ HYDకు రానుంది. ఈ బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు కేంద్ర ప్రభుత్వాధికారులు, న్యాయ పర్యావరణవేత్తలు, ఆయా రంగాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈనెల 11వ తేదీలోగా ఆయా అంశాలపై సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాల్సి ఉంది.

News April 10, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మహమ్మదాబాద్ 39.9 డిగ్రీలు, నవాబుపేట 39.7 డిగ్రీలు, కౌకుంట్ల 39.6, చిన్నచింతకుంట 39.5, మిడ్జిల్ (M)కొత్తపల్లి 39.4, చిన్నచింతకుంట (M) వడ్డేమాన్ 39.2, మూసాపేట (M) జానంపేట 39.2, భూత్పూర్ (M) కొత్త మొల్గర 39.1, కోయిలకొండ 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు ఎండల తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News April 10, 2025

సీతానగరం: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

సీతానగరం మండలంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండయ్య మృతి చెందారు. మరిపివలసకు చెందిన పండయ్య (65) పాలు పోసి ఇంటికి వస్తుండగా రోడ్డు దాటే సమయంలో బొబ్బిలి నుంచి పార్వతీపురం వైపు వస్తున్న బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. SI రాజేశ్ ఘటనపై కేసు నమోదు చేశారు.

error: Content is protected !!