News March 13, 2025

సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య

image

ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో జరిగింది. స్థానికులు, ASI..కథనం ప్రకారం గ్రామానికి చెందిన గౌరమ్మ (45)ను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి SP పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.

Similar News

News January 1, 2026

మీ త్యాగం వల్లే ఈ సెలబ్రేషన్స్.. సెల్యూట్❤️

image

లోకమంతా న్యూఇయర్ వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. మనం ఇక్కడ మిత్రులతో విందులు, వినోదాలతో ఎంజాయ్ చేస్తుంటే.. గడ్డకట్టే హిమపాతంలో కుటుంబానికి దూరంగా సైనికులు దేశం కోసం పహారా కాస్తున్నారు. వారు చేస్తున్న సేవ, త్యాగం వల్లే మనం సురక్షితంగా వేడుకలు జరుపుకోగలుగుతున్నాం. ఆ వీర జవాన్లందరికీ మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం.

News January 1, 2026

HYD: మెట్రోపై సర్కార్ స్టడీ.. టెక్నికల్ కమిటీల ఏర్పాటు

image

HYD మెట్రో సర్కారు చేతుల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ నిర్వహణ ఎలా ఉండాలనే విషయంపై అధికారులు సమాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్‌ను స్టడీ (అధ్యయనం) చేసేందుకు 2 టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ (ఇన్‌ఛార్జి) సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కమిటీలు మెట్రోను పరిశీలించి త్వరలో నివేదిక సమర్పిస్తాయన్నారు.

News January 1, 2026

గత పాలకుల పాపాలతోనే సమస్యలు: అనగాని

image

AP: భూ రిజిస్ట్రేషన్లలో దొర్లిన లోపాల సవరణకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఎ.సత్యప్రసాద్ తెలిపారు. ‘గత పాలకుల కబ్జాలు, ఆక్రమణల పాపాల వల్ల ఈ సమస్యలు వచ్చాయి. రియల్టర్ల అక్రమాలతో డబుల్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్నీ కలెక్టర్లకే ఇచ్చాం. ఎవరు తప్పుచేసినా చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించడంపై అధ్యయనం చేస్తున్నామన్నారు.