News February 9, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739011909046_52434823-normal-WIFI.webp)
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ బూతుల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 9, 2025
NLG: ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఓట్ల వేట!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739071090314_50283763-normal-WIFI.webp)
MLC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 10వ తేదీ వరకు అవకాశం ఉండగా పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ 13తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నోటిఫికేషన్ ముందు నుంచే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
News February 9, 2025
మణుగూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739071530992_19535177-normal-WIFI.webp)
తొగ్గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరుకు చెందిన భూక్య కమలమ్మ(60) మరణించింది. స్థానికుల సమాచారం మేరకు.. మణుగూరు నుంచి అశ్వాపురం వెళ్తుండగా రోడ్డు దాటే క్రమంలో బుల్లెట్ బండి ఢీకొని తీవ్ర గాయాల పాలైనట్లు చెప్పారు. అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయని అన్నారు.
News February 9, 2025
MDK: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739064186105_1243-normal-WIFI.webp)
సిద్దిపేట జిల్లా చేగుంట, గజ్వేల్ రహదారిపై నర్సపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వేణు(48), శివమణి(15), విష్ణు ఒడి బియ్యం పోయించుకోడానికి భార్యను బస్సులో పంపి ఇద్దరు కూమారులతో బైక్పై వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో బైక్ను లారీ ఢీ కొట్టగా తండ్రి వేణు, కుమారుడు శివమణి అక్కడికక్కడే మృతి చెందారు.