News February 1, 2025
సంగారెడ్డి: పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడి, కేజీబీవి, ఆదర్శ పాఠశాలలకు రెండవ విడత పాఠశాల నిర్వహణ గ్రాంటు నిధులు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. గతంలో 50శాతం నిధులు విడుదల కాగా మిగతా 50శాతం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ నిధులను పాఠశాల ఎస్ఎంసీ ఖాతాలో జమ చేశామని చెప్పారు.
Similar News
News March 4, 2025
MROలపై చర్యలు తీసుకుంటాం: జేసీ

అల్లూరి జిల్లాలో మ్యుటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జేసీ అభిషేక్ గౌడ ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో స్వీరించిన ఫిర్యాదులు, భూ సమస్యల పరిష్కారం, రైతుల రిజిస్ట్రేషన్, భూ సర్వే, మ్యుటేషన్లపై కలెక్టరేట్లో మంగళవారం వీసీ నిర్వహించారు. భూముల సర్వేకు సహకరించని సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్లకు సూచించారు. MROలు ఆఫీసులకు రావడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
News March 4, 2025
VZM: ఇంటర్ పరీక్షకు 922 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 22,114 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 21,192 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్స్పెక్టర్ మజ్జి ఆదినారాయణ తెలిపారు. మొత్తం 922 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 90 మంది ఇన్విజిలేటర్లు, 6 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.
News March 4, 2025
నెల్లూరు: ఇంటర్ పరీక్షకు 921 మంది గైర్హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లిష్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం 79 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 27,613 మంది విద్యార్థులకుగాను 26,893 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్లో 1394 మంది విద్యార్థులకు 164 మంది విద్యార్థులు గైర్హజరయ్యారని ఆర్ఐవో తెలిపారు.