News March 6, 2025
సంగారెడ్డి: ఫ్రీ ఫైనల్ పరీక్షలకు శాంపిల్ ఓఎంఆర్ షీట్: DEO

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రీ ఫైనల్ పరీక్షల్లో శాంపిల్ ఓఎంఆర్ షీట్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డి నుంచి ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఇంగ్లీష్, గణితం పాఠ్యాంశాలకు ఓఎంఆర్ షీట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. DCEB కార్యదర్శి లింభాజీ పాల్గొన్నారు.
Similar News
News March 6, 2025
పార్వతీపురం:‘తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి’

వేసవిలో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు అధికార యంత్రాంగం చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. గురువారం మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా తాగునీటి ఎద్దడిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
News March 6, 2025
సత్తా చాటుతున్న బీజేపీ.. BRSకు దెబ్బేనా?

TG: కాంగ్రెస్, BRSను బీజేపీ భయపెడుతోంది. ప్రధాన ప్రతిపక్షం BRS ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. BSP అభ్యర్థికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ నేరుగా పోటీ చేసింది. అయినా బీజేపీ సంచలన విజయం సాధించింది. అటు కేసీఆర్ జనంలోకి రాకపోవడంతో తామే ప్రతిపక్షం అని క్షేత్రస్థాయిలో కాషాయపార్టీ విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ వల్ల BRSకే పెద్ద ముప్పు అని విశ్లేషకుల అంచనా. మీ కామెంట్?
News March 6, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలలో 815 మంది గైర్హాజర్

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలలో భాగంగా
గురువారం పరీక్షకు 815 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. జనరల్లో 21156 మంది, ఒకేషనల్లో 1342 మంది పరీక్షల్లో హాజరు కావలసి ఉందని వివరించారు. మొత్తంగా 22498 మందికి గాను 21683 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.