News March 12, 2025
సంగారెడ్డి: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికీ ప్రమాదముంది. సంగారెడ్డిలో గాలినాణ్యత విలువ 108గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
Similar News
News March 12, 2025
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం: లోకేశ్

AP: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం తొలగించిన ఫీజు రీయింబర్స్మెంట్ను తిరిగి తీసుకొస్తామన్నారు. అలాగే ఫీజు బకాయిలు చెల్లించాలని కొన్ని కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న ఘటనలను ఒప్పుకునేది లేదన్నారు. ఏ కాలేజీ అయినా ఫీజులపై ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సూచించారు.
News March 12, 2025
అనకాపల్లి: రాష్ట్ర పండుగగా నూకాంబిక అమ్మవారి జాతర

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 28 కొత్త అమావాస్య నుంచి వచ్చేనెల 27వ తేదీ వరకు అమ్మవారి జాతర జరుగుతుంది. ఇటీవల నూకాంబిక జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం చంద్రబాబుకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
News March 12, 2025
పెండింగ్లో 10వేలకు పైగా పిటిషన్లు: రంగనాథ్

TG: అక్రమ కట్టడాలపై హైడ్రాకు పెద్ద ఎత్తున పిటిషన్లు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఇప్పటికే 10వేలకు పైగా పిటిషన్లు పరిష్కరించకుండా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఒకప్పటి చెరువుల పరిస్థితి, ప్రస్తుత పట్టణీకరణ, హైడ్రా తీసుకుంటున్నచర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి సమస్యను లోతుగా అధ్యయనం చేశాకే పరిష్కారానికి కృషిచేస్తున్నామని వెల్లడించారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని తెలిపారు.