News February 7, 2025

సంగారెడ్డి: మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం: ఎస్పీ

image

జిల్లాలో పూర్తిస్థాయిలో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ రూపేష్ గురువారం తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాలు సరఫరా చేసిన, విక్రయించిన 87126 56777 నంబర్‌కు తెలపాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

Similar News

News February 7, 2025

శ్రీకాకుళం: యాచనకు వచ్చి.. మహిళపై దాడి

image

యాచనకు వచ్చిన ఓ మహిళ గురువారం రాత్రి శ్రీకాకుళం నగరానికి చెందిన గృహిణిపై దాడి చేసింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. సీమనాయుడుపేటకు చెందిన జయలక్ష్మి కుటుంబం సభ్యులు అందరూ బయటకు వెళ్లారు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్న సమయంలో ఒక మహిళ యాచనకు వచ్చి ఒంటరిగా ఉన్న ఆమెపై దాడి చేసింది. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా జయలక్ష్మి ప్రతిఘటించి కేకలు వేసింది. స్థానికులు రావడంతో ఆ మహిళ పరారైంది.

News February 7, 2025

పిడుగురాళ్ల: ఐదు నెలల తర్వాత రీపోస్టు మార్టం  

image

గత ఏడాది మృతిచెందిన మారం పున్నమ్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన పిడుగురాళ్ల బెల్లంకొండ డొంక పొలంలో గురువారం జరిగింది. ఎస్ఐ మోహన్ కథనం ప్రకారం.. మృతిచెందిన పున్నమ్మ కుమారుడు ఫిర్యాదు మేరకు రీపో స్టుమార్టం నిర్వహించాల్సి వచ్చిందని అన్నారు. కోర్టు ఆదేశాలతో పొలంలో ఉన్న సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికి తీసి, తహశీల్దార్ మధుబాబు పర్యవేక్షణలో రీ పోస్టు మార్టం నిర్వహించారు.  

News February 7, 2025

గొల్లప్రోలు: పవన్ చొరవ.. ఆ గ్రామస్థుల కల నెరవేరింది

image

గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట గ్రామస్థుల కల నెరవేరింది. గొల్లప్రోలు, తాటిపర్తి గ్రామాల నుంచి చిన్న జగ్గంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు గోతులమయంగా మారడంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు గురయ్యేవారు. ఆ గ్రామస్థులు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదు. దీంతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ఆ గ్రామస్థుల ఇబ్బందులు తొలిగాయి.

error: Content is protected !!