News March 19, 2025
సంగారెడ్డి యువతకు GOOD NEWS

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో 7.20 లక్షల మంది యువత ఉన్నారు. ఏప్రిల్ 5 వరకు http:///tgobmmsnew.cgg.gov.in లో అప్లై చేసుకుంటే జూన్ 2 అర్హుల తుది జాబితా ప్రకటిస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో వెల్లడించనున్నారు. ఎంచుకునే యూనిట్ని బట్టి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు.
Similar News
News March 19, 2025
ఎంతిస్తారో కూడా నాకు చెప్పలేదు: శశాంక్ సింగ్

రిటెన్షన్లో తనకు ఎంత ఇస్తారో కూడా తెలియకుండానే సంతకం చేశానని PBKS ప్లేయర్ శశాంక్ సింగ్ తెలిపారు. తాను వేలంలో లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. ‘గతంలో చాలాసార్లు నన్ను వేలంలో తిరస్కరించారు. తీసుకున్నా అవకాశాలు వచ్చేవి కావు. గత సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో రిటైన్ చేసుకున్నారు. రిటైన్ సమయంలో నాకు ఎంత ఇచ్చేది వారు చెప్పలేదు. నేనూ బేరమాడలేదు. ఫామ్పై సంతకం చేశా అంతే’ అని చెప్పుకొచ్చారు.
News March 19, 2025
‘RRR’లో మెయిన్ హీరో ఇతడే.. ‘GROK’ ద్వంద్వ వైఖరి!

సినిమాల విషయంలో ‘GROK’ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఫ్యాన్ వార్స్ సృష్టిస్తోంది. తాజాగా ‘RRR’ సినిమాలో మెయిన్ హీరో కొమురం భీమ్ క్యారెక్టర్లో నటించిన ఎన్టీఆర్ అని చెప్తోంది. గోండు జాతికి చెందిన భీమ్ బ్రిటిష్ వారి నుంచి మల్లిని కాపాడాడని ఉదహరిస్తోంది. రామ్ చరణ్ది కీలక పాత్ర అని చెప్తూనే.. మరికొందరికి ఇతనే మెయిన్ హీరో అని రిప్లై ఇస్తోంది. దీంతో ఫ్యాన్స్ మధ్య గందరగోళం నెలకొంది. మీ కామెంట్?
News March 19, 2025
బిల్గేట్స్ను ఏపీకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

AP: బిల్గేట్స్ ఫౌండేషన్తో పలు ఒప్పందాల అనంతరం సీఎం చంద్రబాబు బిల్గేట్స్ను అమరావతి, తిరుపతికి రావాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. 1995 నుంచి బిల్గేట్స్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సీఎం చెప్పారు. మరోవైపు, ఈ ఉదయం పార్లమెంట్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో CBN భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం చంద్రబాబు విజయవాడకు తిరుగుపయనం అయ్యారు.