News March 18, 2025
సంగారెడ్డి: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో స్టేట్ ర్యాంక్

సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్కి చెందిన జనార్దన్ రెడ్డి సోమవారం విడుదలైన గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2024 జూన్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు పరీక్ష జరిగింది. ఈ క్రమంలో జోన్లో 21 ర్యాంక్, స్టేట్లో 176వ ర్యాంక్ సాధించిన జనార్దన్ రెడ్డికి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగం వరించింది. జనార్దన్ రెడ్డి ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.
Similar News
News March 18, 2025
హైడ్రా పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు: రంగనాథ్

TG: హైడ్రా పేరు చెప్పి లావాదేవీలు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీనిపై గతంలోనే ప్రకటన చేశామని, ఇప్పటికే హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడిన పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇలా ఎవరైనా మోసపోతే తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లేదా స్థానిక పోలీసులనూ ఆశ్రయించవచ్చన్నారు.
News March 18, 2025
NZB: ఇంటర్ పరీక్షలకు 475 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు 2వ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 475 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. జిల్లాలో మొత్తం 16,766 మంది విద్యార్థులకు గాను 16,291 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. మొత్తం 95.9 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామన్నారు.
News March 18, 2025
ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, వాహనాలను ఓవర్ టేక్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిపై అవగాహన కల్పించాలన్నారు.