News March 28, 2025

సంగారెడ్డిలో మరో విషాదం..

image

SRD జిల్లాలో మరో విషాదం జరిగింది. కోహిర్ మండలం పైడిగుమ్మల్‌లోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు కార్మికులు మరణించారు. మృతులను UPకి చెందిన బైద్యనాథ్ భట్, ఒడిశావాసి హరిసింగ్‌గా గుర్తించారు. పైడిగుమ్మల్‌లోని వెంచర్‌లో పనిచేసేందుకు వీరిద్దరు వలస వచ్చారు. వీరు ఈనెల 10న అదృశ్యం కాగా 13న కోహిర్ PSలో కేసు నమోదైంది. గురువారం రాత్రి వ్యవసాయ బావిలో కార్మికుల మృతదేహాలను గుర్తించి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News April 1, 2025

MDK: వ్యవసాయ శాఖకు కొత్త ఫోన్‌ నంబర్లు

image

మెదక్ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల నంబర్లు మారాయి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో పాటు సహాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, పీఏలకు సంబంధించిన అధికారుల నంబర్లు మారినట్లు జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ కుమార్ తెలిపారు. ఇదివరకు ఐడియా వొడాఫోన్ నంబర్లు ఉండగా ఎయిర్ టెల్‌లోకి మారాయి.

News April 1, 2025

మెదక్: పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ మాసం మొత్తం జిల్లా వ్యాప్తంగా 30, 30(ఏ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.

News March 31, 2025

UPDATE: చెరువులో దూకిన వ్యక్తి శవం లభ్యం

image

తూప్రాన్ పట్టణంలోని మ్యాడక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శవం లభించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన దాసరి యాదగిరి(40) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఉగాది సందర్భంగా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన యాదగిరి సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గాలింపు చేపట్టగా సోమవారం శవం లభించింది.

error: Content is protected !!