News February 18, 2025

సంగారెడ్డిలో యువకుడి మర్డర్.. UPDATE

image

సంగారెడ్డి జిల్లాలో ఓ <<15474129>>యువకుడు<<>> దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తన కూతురితో చనువుగా ఉంటున్నాడన్న కారణంతో నిజాంపేట మండలం రాంచందర్ తండాకు చెందిన లారీ డ్రైవర్ దశరథ్(26)ను ఈనెల 12న అమ్మాయి తండ్రి గోపాల్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోపాల్, ఆయన భార్య విజ్జీబాయి, మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించగా నిన్న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News March 14, 2025

సంప్రదాయాలు పాటిస్తూ హోళీ జరుపుకోవాలి: కలెక్టర్

image

సంప్రదాయాలను పాటిస్తూ జరుపుకోవాలని ప్రజలకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సమానత్వానికి ప్రతీకని, ఈ రంగుల పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందించేలా మారాలని, ఆనందంగా, భద్రతతో, జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా హోలీ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. హోలీ ఆడిన తదుపరి బావులు, వాగులు, చెరువులు, గోదావరిలో స్నానాలకు వెళ్ళొద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.

News March 14, 2025

మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

image

హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాగ ద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషం వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీని జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.

News March 14, 2025

తూప్రాన్: ఎల్ఆర్ఎస్ పై స్పెషల్ ఆఫీసర్ సమావేశం

image

తూప్రాన్ మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ పై ప్రత్యేక అధికారి (జెడ్పీ సీఈవో) ఎల్లయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ ప్రత్యేక అధికారిగా నియామకమైన జడ్పీ సీఈఓ ఎల్లయ్య మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో ఎల్ఆర్ఎస్ పై సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారు 31లోగా రుసుము చెల్లించి రాయితీ పొందాలని సూచించారు. కమిషనర్ గణేష్ రెడ్డి పాల్గొన్నారు.

error: Content is protected !!