News May 9, 2024
సంతమాగులూరు: అదుపుతప్పి మిర్చి లారీ బోల్తా

మండలంలోని పాత మగులూరు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు మిర్చి యార్డుకు మిరపకాయలు తీసుకొని వెళ్తున్న మినీ లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. అందులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే రహదారిపై మినీ ఆటో బోల్తాపడడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లారీని పక్కకు తీసి ట్రాఫిక్ని క్లియర్ చేశారు.
Similar News
News April 24, 2025
రాష్ట్రంలో చివరి స్థానంలో ప్రకాశం జిల్లా

ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్లో 3,668 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే.. 547 మంది పాస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. 14.9 శాతంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా 26వ స్థానంలో నిలిచింది. అలాగే ఓపెన్ టెన్త్లో 1,184 మంది పరీక్షలు రాస్తే.. 88 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 7.4 శాతంతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది.
News April 24, 2025
పొదిలి: రోడ్డుపై మద్యం లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

పొదిలి మండలం సలకనూతల వద్ద మార్కాపురం నుంచి దర్శికి మద్యం లోడ్తో వెళుతున్న వాహనం బుధవారం ప్రమాదానికి గురై రోడ్డుపై బొల్తాపడింది. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడగా.. మద్యం ప్రియులు వాటి కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.
News April 24, 2025
ఒంగోలు: రేషన్ మాఫియా డాన్ పనేనా..?

వీరయ్య చౌదరి హత్య కేసులో ఓ రేషన్ మాఫియా డాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఒంగోలులో హత్య తర్వాత అతను ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. వాహనాలు మారుస్తూ గుంటూరు(D) వెదుళ్లపల్లికి వెళ్లి అక్కడ ఓ రైస్ మిల్లర్ నుంచి డబ్బులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ మిల్లర్ సమాచారంతో డాన్కు సహకరించారన్న అనుమానాలతో నిడుబ్రోలుకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, వీళ్లు ఎన్నికల్లో YCPకి అనుకూలంగా పనిచేశారని సమాచారం.