News February 25, 2025
సజావుగా ఎన్నికలు నిర్వహించండి: కలెక్టర్

ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఎన్నికల సిబ్బందికి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పిఒ, ఎపిఓ, ఓపిఓ, రూట్, సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ సరళి మాత్రమే చూసుకుంటే సరిపోదని, అనవసర వ్యక్తులను పోలింగ్ స్టేషన్ పరిధిలోకి రాకుండా, వారిని నియంత్రించే బాధ్యత కూడా చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News February 25, 2025
మూడోరోజు.. ఇంకా లభించని ఆచూకీ

TG: SLBC టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకొని మూడురోజులు అవుతున్నా వారి ఆచూకీ లభించలేదు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టన్నెల్లో భారీగా ఊట నీరు వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. బురద మరింత పేరుకుపోతోంది. లోపలికి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా బురద లోంచి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
News February 25, 2025
గంజాయి కేసులో పదేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

గంజాయి కేసులో ముద్దాయిలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ అనకాపల్లి 10వ అదనపు జిల్లా కోర్టు తీర్పును ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. 2021 మే 20వ తేదీన అనకాపల్లి టౌన్ పరిధిలో 20 కేజీల గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కోర్టు సోమవారం శిక్షను విధించిందని ఎస్పీ తెలిపారు.
News February 25, 2025
ALP: మహాశివరాత్రికి లడ్డూ ప్రసాదం రెడీ

అలంపూర్ లో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ దేవి ఆలయాల్లో ఈనెల 26న జరిగే మహాశివరాత్రి వేడుకలకు ఆలయాలు సుందరంగా ముస్తాబు అయ్యాయి. స్వామి అమ్మవారి మహా ప్రసాదంగా భావించే లడ్డు ల కొరత రాకుండా భక్తుల సౌకర్యార్థం 20 వేల లడ్డులు తయారు చేయించినట్లు ఈవో పురందర్ కుమార్ సోమవారం తెలిపారు. శివరాత్రి వేడుకలకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు.