News April 25, 2025

సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

సత్తెనపల్లి (M) రెంటపాళ్లలో గురువారం ప్రమాదం జరిగింది. ఘటనలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మృతుడు మహేశ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పుట్టిన రోజు కావడంతో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా DDపాలెం రోడ్డులో ఎదురుగా వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో మహేశ్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News April 25, 2025

GNT: ట్రిపుల్ ఐటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారని పొన్నూరు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 20వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థుల నుంచి రూ.300, రిజర్వు గ్రూపుల నుంచి రూ.200 చెల్లించాలన్నారు.

News April 25, 2025

మేయర్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం: అంబటి

image

గుంటూరు మేయర్ ఎన్నికపై వైసీపీ అనూహ్య మలుపు తిరిగింది. పోటీలో వైసీపీ పోటీ చేయదని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అంబటి రాంబాబు అభ్యర్థిని ప్రకటిస్తామని గురువారం తెలిపారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు బృందావన్ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

News April 25, 2025

దేవతల నగరంగా అమరావతి ప్రసిద్ధి

image

నవ్యాంధ్ర రాజధాని అమరావతి చరిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల రాజధానిగా పేరు పొందింది. దేవతల నగరంగా ఖ్యాతి గాంచింది. బౌద్ధ మతం ఇక్కడ విలసిల్లింది. గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణా నది పక్కనే ఉన్న అమరావతి ఎన్నో విశిష్టతలు కలిగి ఉంది. బౌద్ధ స్తూపం, మ్యూజియం, ధ్యాన బుద్ధ విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఇక్కడి అమరలింగేశ్వర దేవాలయం దేశంలోని పంచారామ క్షేత్రాలలో ఒకటిగా పేరుంది.

error: Content is protected !!