News March 9, 2025
సత్యసాయి జిల్లాలో యువతి సూసైడ్

శ్రీ సత్యసాయి జిల్లాలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామానికి చెందిన ఓ యువతి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల వివరాల మేరకు.. మహిళకు ఇటీవల వివాహం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 10, 2025
అనాతవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ముమ్మిడివరం మండలం అనాతవరం సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ఆబోతును ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. వెనక కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయి. కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 10, 2025
850 మందిపై టౌన్ న్యూసెన్స్ కేసులు: VZM SP

జనవరి నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 850 మందిపై టౌన్ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 11 గంటలు దాటిన తరువాత సరైన కారణం లేకుండా పట్టణంలో సంచరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. అలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తునట్లు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు.
News March 10, 2025
మేడారం జాతరకు అప్రమత్తంగా ఉండాలి: సీతక్క

ములుగు జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీతక్క మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాలన్నారు. రానున్న మహా మేడారం జాతరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.