News April 3, 2025

సన్న బియ్యం పంపిణీ చేసిన నల్గొండ కలెక్టర్

image

దిండి(గుండ్లపల్లి) మండలం కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఏఎస్పీ మౌనిక ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, కొత్త రేషన్ కార్డుల కోసం ఈ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 10, 2025

NLG: ఐదు రోజులే గడువు: ఇలా త్రిపాఠి

image

రాజీవ్ యువ వికాస పథకానికి ఏప్రిల్ 14 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను, గ్రామాలు, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో టామ్ టామ్ నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబానికి ఐదేళ్ల కాలంలో ఒకే సంక్షేమ పథకానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అన్నారు.

News April 9, 2025

చిట్యాల: 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నర్రా రాఘవరెడ్డి

image

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన కమ్యూనిస్టు యోధుడు నర్రా రాఘవ రెడ్డి 1967, 1978, 1983, 1984, 1989, 1994 సంవత్సరాలలో నకిరేకల్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కమలమ్మ రామ్ రెడ్డి దంపతులకు జన్మించిన రాఘవరెడ్డి ఎన్నో ఉద్యమాలలో ప్రజా సమస్యలపై కీలకంగా పని చేశారు. ప్రతిపక్ష నేతగా టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుపై తీవ్రంగా విరుచుకు పడేవారు. నేడు రాఘవరెడ్డి వర్ధంతి.

News April 9, 2025

నల్గొండ జిల్లాలో CONGRESS VS BRS

image

నల్గొండ జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRSనేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRSనేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

error: Content is protected !!