News July 11, 2024
సరసమైన ధరలకు కందిపప్పు, బియ్యం: కలెక్టర్

నంద్యాలలోని పద్మావతి నగర్ రైతు బజార్లో నాణ్యమైన కర్నూలు సోనా బియ్యం, సార్టెక్స్ కందిపప్పు ప్రత్యేక విక్రయ కేంద్రాలను కలెక్టర్ రాజకుమారి గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కందిపప్పు, బియ్యం సరఫరా చేయాలని సంంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2025
రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్

కర్నూలులో మౌలిక వసతుల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని నగర మేయర్ బీవై రామయ్య అన్నారు. గురువారం కర్నూలు నగర పాలక కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. 10 తీర్మానాలను, సాధారణ నిధుల నుంచి రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా ఊపారు. మేయర్ మాట్లాడుతూ.. ప్రజా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.
News March 13, 2025
రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్కు భూమిపూజ

పత్తికొండ మండలంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మరో ముందడుకు పడింది. రూ.11కోట్ల వ్యయంతో కోతిరాళ్ల పంచాయతీ పరిధిలో ఈ యానిట్ ఏర్పాటుకు రేపు భూమి పూజ జరగనుంది. మంత్రి TG భరత్, ఎమ్మెల్యే శ్యామ్కుమార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. కాగా పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో టమాటా అధికంగా సాగువుతోంది. ఈయూనిట్ ప్రారంభమైతే తమకు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.
News March 13, 2025
రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్కు భూమిపూజ

పత్తికొండ మండలంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మరో ముందడుకు పడింది. రూ.11కోట్ల వ్యయంతో కోతిరాళ్ల పంచాయతీ పరిధిలో ఈ యానిట్ ఏర్పాటుకు రేపు భూమి పూజ జరగనుంది. మంత్రి TG భరత్, ఎమ్మెల్యే శ్యామ్కుమార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. కాగా పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో టమాటా అధికంగా సాగువుతోంది. ఈయూనిట్ ప్రారంభమైతే తమకు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.