News July 24, 2024

సర్టిఫికేషన్‌కు కేంద్రం సహకారం.. రైతులకు ఊరట

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46,736 మంది రైతులు 49,631 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 253 గ్రామాల్లో అనుసరిస్తున్నారు. వీరు పండించే ఉత్పత్తులకు బ్రాండింగ్, నిల్వ, మార్కెటింగ్, సర్టిఫికేషన్‌కు కేంద్రం సహకారం అందిస్తామని ప్రకటించడంతో వేలాది మంది రైతులకు ఊరట లభించింది. ప్రకృతి సేద్యం పెరిగితే పురుగుమందుల, అవశేషాలు లేని ఆహార లభ్యత మెరుగవుతుంది.

Similar News

News October 1, 2024

MLC ఎన్నికలకు ఓట్లు నమోదు చేసుకోండి: జూలకంటి

image

కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. మాచర్లలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికలతో పాటు ఓటర్ లిస్టు ఉండదని అందరూ నూతనంగా తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రాడ్యుయేట్స్ వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News September 30, 2024

లడ్డూలా దొరికిపోయిన బాబు: అంబటి రాంబాబు

image

తిరుమల లడ్డూ వివాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను నేడు సుప్రీం కోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ ఆరోపణలు చేసి లడ్డులా దొరికిపోయిన బాబు!’ అంటూ ట్విట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

News September 30, 2024

US కాన్సులేట్ ప్రతినిధులతో మంత్రి అనిత సమావేశం

image

రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హైదరాబాద్ నానక్ రామ్ గుడ లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుపై హోం మంత్రి చర్చించారు. అమెరికా వెళ్లాలనుకునే వారు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని అన్నారు. వీసా అప్లికేషన్ సిస్టం సులభతరం చేయవలసిందిగా హోమ్ మంత్రి కోరగా యూఎస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారన్నారు.