News February 7, 2025
సర్పంచ్ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లా వివరాలు
గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో జిల్లాలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఇప్పటినుంచి తమ వంతుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ZPTC- 27, MPP-27, ఎంపీటీసీ- 276, గ్రామ పంచాయతీలు 633 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 295 నుంచి 276 కు తగ్గించారు. జెడ్పిటిసిలు 25 నుంచి 27 కు పెరిగాయి. గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
Similar News
News February 7, 2025
మన్యం బంద్కు ఆదివాసి ఉద్యోగ సంఘాల మద్దతు
ఈ నెల 12న తలపెట్టిన మన్యం బంద్కు ఆదివాసి ఉద్యోగ సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆదివాసి ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సోడే నారాయణ గురువారం అన్నారు. చింతూరులో జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. 1/70 చట్టం సవరణ చేయడానికి అధ్యయనం చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించడం మంచిది కాదన్నారు. ఇప్పటికే మాకు జీవనాధారమైన జీవో నంబర్-3ని దూరం చేశారన్నారు. బంద్ పిలుపుకు ఉద్యోగ జేఏసీ మద్దతు ఉంటుందన్నారు.
News February 7, 2025
జనగామ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు
తమిళనాడులో ఘనంగా నిర్వహించే అరుణాచల గిరి ప్రదర్శన దర్శనానికి జనగామ డిపో నుంచి ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు జనగామ డిపో మేనేజర్ స్వాతి ప్రకటనలో తెలిపారు. పెద్దలకు రూ.4 వేలు, పిల్లలకు రూ.2,500 టికెట్ ధరలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన బయలుదేరి 13వ తేదీకి తిరిగి జనగామకు చేరుకుంటుందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 7, 2025
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళన
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళన చేసిన ఘటన పెనుబల్లి మండలంలో చోటుచేసుకుంది. మండాలపాడుకి చెందిన గోపీచంద్ తాను 7ఏళ్లుగా ప్రేమించుకున్నామని.. కొద్ది రోజుల క్రితం తనకు వేరే వ్యక్తి వివాహమైందని బాధితురాలు తెలిపింది. భర్తను వదిలేసి తన వద్దకు రావాలని గోపిచంద్ వేధించడంతో భర్తకు విడాకులు ఇచ్చానట్లు వెల్లడించింది. తీరా వచ్చిన తరువాత గోపిచంద్ ముఖం చాటేస్తున్నాడని అవేదన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టింది