News April 25, 2024
సలేశ్వరం జాతర.. వెళ్లొస్తాం లింగమయ్యా…

సలేశ్వరం ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. 3 రోజుల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు లింగమయ్యను దర్శించుకున్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు వస్తున్నాం లింగమయ్యా.. వెళ్లొస్తాం లింగమయ్యా.. భక్తి పారవశ్యంతో తరలివచ్చారు. శివమామస్మరణాలతో నల్లమల మార్మోగింది. ఈ ఏడాది ఎండల తీవ్రతో భక్తుల రద్దీ తగ్గింది. ఉత్సవాలకు పోలీస్ శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. వర్షాలు లేకపోవడంతో ఊపీరి పీల్చుకున్నారు.
Similar News
News April 25, 2025
వనపర్తి: విషపూరిత ద్రవం తాగి చిన్నారి మృతి

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలోని 9వ వార్డులో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీకి చెందిన వంశీ, గాయత్రి దంపతులకు ఆర్థిక(18 నెలలు), మణికంఠ పిల్లలు ఉన్నారు. సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఆర్థిక ఓ బాటిల్లో ఉన్న ద్రవాన్ని తాగింది. దీంతో చిన్నారి మృతిచెందింది. మణికంఠ కళ్లమీద ద్రవం పడటంతో బొబ్బలు వచ్చాయి. మణికంఠను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ ద్రవం ఏంటో తెలియరాలేదు.
News April 25, 2025
MBNR: బిల్డింగ్పై మృతదేహం కలకలం..!

ఓ యువకుడి మృతదేహం కలకలం సృష్టించిన ఘటన MBNRజిల్లా అడ్డాకులలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామ వాసి షేక్బాలీ కుమారుడు ముస్తాక్(37) మద్యానికి బానిసై ఇంటికి రాకుండా కొన్నాళ్లుగా నిర్మాణంలోని ఓ బిల్డింగ్పై పడుకుంటున్నాడు. గురువారం ఓ కుక్క మనిషి చేతిని నోట కరుచుకుని రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు చూసి పోలీసులకు చెప్పారు. వారొచ్చి బిల్డింగ్పై చూడగా ముస్తాక్ శవం కుళ్లిపోయి కనిపించింది.
News April 25, 2025
‘MBNR జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి’

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. గురువారం కోయిలకొండ మండలంలో రైతు వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచులు ఉన్నాయా పరిశీలించి తెలుసుకున్నారు. అలాగే ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు.