News March 18, 2025
సవిత షటిల్.. పరిటాల సునీత క్యారమ్స్

విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో నేటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్లో ఆడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత తన పేరును నమోదు చేసుకున్నారు. 100M పరుగు పందెంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పోటీ పడనున్నారు. మడకశిర ఎమ్మెల్యే రాజు క్రికెట్ ఆడనున్నారు.
Similar News
News March 18, 2025
గద్వాల జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

గద్వాల జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం.సంతోష్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పనుల కింద చేపట్టిన సీసీ రోడ్లు తదితర నిర్మాణ పనుల పురోగతిపై మండలాల వారీగా ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.
News March 18, 2025
BREAKING: కర్నూలు జిల్లాలో 11 మంది SIల బదిలీ

☛ బాల నరసింహులు హొళగుంద నుంచి కర్నూలు త్రీటౌన్
☛ హనుమంత రెడ్డి VR TO కోసిగి
☛ చంద్రమోహన్ కోసిగి TO కర్నూలు 3టౌన్
☛ కేశవ కొత్తపల్లి TO నందవరం
☛ శ్రీనివాసులు నందవరం TO DCRB కర్నూలు
☛ రమేశ్ బాబు VR TO కర్నూలు 1టౌన్
☛ మన్మథ విజయ్ కర్నూలు 3టౌన్ TO ఆస్పరి
☛ మల్లికార్జున DSO నుంచి జొన్నగిరి
☛ జయశేఖర్ జొన్నగిరి నుంచి ఆదోని 3టౌన్
☛ దిలీప్ కుమార్ ఆలూరు నుంచి హోళగుంద
☛ మహబూబ్ బాషా హోళగుంద నుంచి ఆలూరు
News March 18, 2025
ఇచ్ఛాపురం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు IlT, JAM ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. ఈ మేరకు మంగళవారం విడుదలైన ఆల్ ఇండియా IIT JAM, MSc కెమిస్ట్రీ ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు బాకేశ్వరి 467, గుడియా జ్యోతి 786, బి.పూజిత 1333 ర్యాంకులు సాధించారు. ఈ సంధర్భంగా ప్రిన్సిపల్ డా.రబిన్ కుమార్ పాడి ద్వారా కెమిస్ట్రీ లెక్చరర్ శివకుమార్ విద్యార్థులకు రూ.12 వేల నగదు బహుమతి అందించారు.