News March 22, 2025
సాధారణ భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపాథ్యంలో సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈనెల 28 నుంచి జరిగే జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. జాతర నిర్వహణలో ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి శాఖకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
Similar News
News March 22, 2025
నేడు ఎర్త్ అవర్ పాటించాలి: పార్వతీపురం కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో ప్రజలందరూ శనివారం ఎర్త్ అవర్ పాటించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్ అవర్కు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ప్రజలందరూ ఇళ్లల్లో లైట్లు ఆపివేయాలన్నారు. వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News March 22, 2025
చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీరిలీజ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘నాయక్’ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా ‘నాయక్’ రీరిలీజ్పై అభిమానుల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చరణ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తెరకెక్కించారు. ఈ చిత్రం 2013లో రిలీజవగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాగా, ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు.
News March 22, 2025
విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

AP: విశాఖ మేయర్ వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలుగా కూటమి నేతలు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో YCPకి షాక్ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. GVMCలో 98 స్థానాలుండగా, YCP 59 చోట్ల గెలిచింది. ఈ 9 నెలల్లో 28 మంది కూటమి పార్టీల్లో చేరడంతో YCP బలం పడిపోయింది. మేయర్కు నాలుగేళ్ల పదవీకాలం పూర్తవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానానికి మార్గం సుగమమైంది.