News May 29, 2024

సారవకోట: గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

సారవకోట మండలం అన్నుపురం గ్రామానికి చెందిన యడ్ల పోలీసు(65) డాబా పై నుంచి జారిపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసు ఈ నెల 23న రాత్రి భోజనం చేసి డాబాపై నిద్రించాడు. మూత్ర విసర్జనకు కిందకు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో కేజీహెచ్‌కు తరలించగా వైద్య సహాయం పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Similar News

News October 8, 2024

టెక్కలి: జ్వరంతో స్టాఫ్ నర్స్ మృతి

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మీ(35)అనే మహిళ జ్వరంతో మంగళవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా డెంగీ జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. మృతురాలిది నందిగం మండలం సుభద్రాపురం. స్టాఫ్ నర్స్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలికి భర్త మాధవరావు, ఇద్దరు కుమార్తెలున్నారు.

News October 8, 2024

DSC శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

SC,ST విద్యార్థులకు ఉచిత DSC శిక్షణ ఇవ్వడానికి శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఇచ్చినందుకు శిక్షణ సంస్థలకు టెండర్ ద్వారా అమౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన శిక్షణా సంస్థలు వివరాలకు https://tender.apeprocurernant.gov.in పోర్టల్‌లో డాక్యుమెంట్ నంబర్ 757795ను పరిశీలించి ఈ నెల 21లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News October 8, 2024

SKLM: 2714 అభివృద్ధి పనులకు అనుమతులు- కలెక్టర్

image

రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంపై మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని పంచాయతీల పరిధిలో 3071 పనులు గుర్తించామని.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.249 కోట్లు అంచనా వేసినట్లు తెలిపారు. వీటిలో 2714 పనులకు అనుమతులు ఇచ్చామన్నారు.