News April 7, 2025

సింగపూర్ కాన్సులేట్‌తో ఐటీ మంత్రి సమావేశం

image

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్‌తో సోమవానం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, తెలంగాణను ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. రాష్ట్రం నుంచి రెండు లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజినీర్లను సిద్ధం చేయడం తమ ప్రధాన లక్ష్యమని శ్రీధర్‌బాబు తెలిపారు.

Similar News

News April 8, 2025

HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2025

HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2025

మద్యం మత్తులో హత్య: సీఐ

image

రావికమతం మండలం గర్ణికంలోని ఆదివారం రాత్రి పవన్ కుమార్ <<16017545>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. యువకుడి హత్యకు స్నేహితుల మధ్య మద్యం మత్తులో తలెత్తిన వివాదం కారణం కావొచ్చని సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వరరావు తెలిపారు. అతనితో కలిసి మద్యం తాగిన స్నేహితుల వివరాలు, హత్యకు దారి తీసిన వివాదంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. పవన్‌కు గతంలో నేర చరిత్ర ఉందన్నారు.

error: Content is protected !!