News April 7, 2025
సింహపురి ప్రీమియం లీగ్ ప్రారంభం

నెల్లూరు సమీపంలోని బుజబుజ నెల్లూరు సీఐఏ క్రికెట్ అకాడమీలో సింహపురి ప్రీమియర్ లీగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్ పి.విజయ్కుమార్, మదీనా ఇంతియాజ్ తదితరులు హాజరయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ గూడూరు జట్టు 19.2 ఓవర్లలో 10 వికెట్లకు 139 పరుగులు సాధించింది. ఆత్మకూర్ రేంజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు సాధించి ఓడిపోయింది.
Similar News
News April 17, 2025
నెల్లూరు: 3.69 లక్షల ఎకరాలకు సాగునీరు

నెల్లూరు జిల్లాలో 3.69 లక్షల ఎకరాల రెండో పంటకు నీరు అందించాలని ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన నెల్లూరులోని జడ్పీ హాలులో ఐఏబీ సమావేశం జరిగింది. 41 టీఎంసీల జలాలను రెండో పంటకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఈ విషయంలో సాగునీటి సంఘాల ప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
News April 17, 2025
PM ఇంటర్న్షిప్కు నమోదు చేసుకోండి: MP

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయన కోరారు.
News April 17, 2025
నెల్లూరు: నిమ్మకు తెగుళ్ల బెడద..!

నెల్లూరు జిల్లాలో 10వేల హెక్టార్లలో నిమ్మపంట సాగవుతోంది. వివిధ రకాల తెగుళ్లు ఆశించడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తోటలు పాడైపోతున్నాయి. ముఖ్యంగా ఈపంటపై ఆకు ముడత, పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు, బంక, వేరుకుళ్లు, గజ్జి, మొజాయిక్ తెగుళ్లు ఆశించాయి. వీటి నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని పొదలకూరు ఉద్యాన అధికారి ఆనంద్ సూచించారు.