News April 22, 2024

సింహాచలం అప్పన్న సన్నిధిలో పండిత సదస్సు

image

సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఆదివారం రాత్రి పండిత సదస్సును వైదిక వర్గాలు సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద పండితులు సింహాద్రి అప్పన్న శ్రీదేవి భూదేవిని కొనియాడుతూ కీర్తించారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి, అదనపు కమిషనర్ చంద్రకుమార్ పాల్గొన్నారు.

Similar News

News April 21, 2025

ఉమ్మడి విశాఖలో కేటగిరీల వారీగా డీఎస్సీ పోస్టులు ఇలా..

image

డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాలో 734 పోస్టులు భర్తీ చేయనున్నారు. రోస్టర్ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. OC- 290, BC-A: 53, BC-B: 73, BC-C:7, BC-D:49, BC-E:29, SC గ్రేడ్1- 13, SC గ్రేడ్2- 44, SC గ్రేడ్3- 60, ST- 43, EWS- 73 పోస్టులు కేటాయించారు.

News April 21, 2025

విశాఖ కేంద్రంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్.. నిర్వాహకుల అరెస్ట్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప.గో జిల్లా పాలకొల్లుకు చెందిన వెంకటరావు, మురళీలను ఆదివారం పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శ్రీవేద వివరాల మేరకు.. HYD, విశాఖ కేంద్రంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 10 ఫోన్లు, రూ.33,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని.. వీరిలో ఒకరు వైసీపీ నేత అని చెప్పారు.

News April 21, 2025

విశాఖ: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్!

image

విశాఖ జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?

error: Content is protected !!