News April 27, 2024
సింహాచలంలో సుప్రభాత సేవ టికెట్లు పునఃప్రారంభం

సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నృసింహ స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత రద్దు చేసిన దర్శనాలను కూడా పునః ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.
Similar News
News April 21, 2025
తెట్టంగిలో బంగారం చోరీ

గుర్ల మండలంలోని తెట్టంగిలో ఐదున్నర తులాల బంగారం దొంగతనం అయినట్లు ఎస్సై పి.నారాయణ రావు సోమవారం తెలిపారు. తెట్టంగికి చెందిన జమ్ము పాపి నాయుడు ఇంట్లో ఈ దొంగతనం జరిగిందని చెప్పారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లతో పూర్తి స్థాయిలో పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై చెప్పారు.
News April 21, 2025
విజయనగరం: కేటగిరీల వారీగా పోస్టులు వివరాలు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో డీఎస్సీ ద్వారా 446 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. కేటగిరిలా వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.➤ OC-184 ➤ BC-A:33 ➤ BC-B:43➤ BC-C:3 ➤ BC-D:31 ➤ BC-E:16➤ SC- గ్రేడ్1:10 ➤ SC-గ్రేడ్2:29➤ SC-గ్రేడ్3:31 ➤ ST:26 ➤ EWS:40 NOTE సజ్జెక్టుల వారీగా వివరాల కోసం ఇక్కడ <<16156073>>కిక్ల్<<>> చేయండి.
News April 21, 2025
రాజాం: జనసేన నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు

మండలంలోని ఒమ్మి గ్రామానికి చెందిన చిత్తరి నాగరాజు రాజాంలోని ఆర్కే కాంప్లెక్స్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్డులు ఇస్తున్నారని వెళ్లారు. జనసేన నాయకుడు పొగిరి సురేశ్ బాబు తనను ఇక్కడికెందుకు వచ్చావని కులం పేరుతో తిట్టి, అతని అనుచరులతో దాడి చేయించాడని రాజాం పోలీసు స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ రవి కుమార్ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.