News July 4, 2024

సికింద్రాబాద్: B.Tech పూర్తి చేసిన ఆర్మీ అధికారులు

image

సికింద్రాబాద్ MCEME వద్ద జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాన్వకేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా TES-41, B.Tech కోర్సు పూర్తి చేసిన ఆర్మీ అధికారులకు పట్టాలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో శ్రీలంక, భూటాన్ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అధికారులు సైతం ఉన్నట్లు డాక్టర్ రమేశ్ కంచర్ల తెలియజేశారు. ఉద్యోగంలోనే ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని అధికారులన్నారు.

Similar News

News September 23, 2024

గచ్చిబౌలి: సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే

image

గచ్చిబౌలి పరిధిలోని T-HUBలో సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే వేడుకలు నిర్వహిస్తామని కార్య నిర్వాహకులు తెలిపారు. AI, డిజిటల్ విధానం, ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.

News September 23, 2024

HYD: 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు

image

HYDలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 18% పెరగడం గమనార్హం. 2023లో 46,287 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది.

News September 23, 2024

HYD: మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు డబుల్

image

HYD, సికింద్రాబాద్, రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో గతంలో 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరుకుందని అధికారులు తెలియజేశారు. దీన్నిబట్టి గమనిస్తే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయినట్లుగా తెలుస్తోంది.