News April 6, 2025
సికింద్రాబాద్: రైలులోని వాష్రూమ్లో అత్యాచారం (UPDATE)

రక్సెల్-సికింద్రాబాద్ రైలులోని వాష్రూమ్లో బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడి ఫొటోలు బయటకొచ్చాయి. HYDను చూడడానికి ఫ్యామిలీతో కలిసి వస్తున్న బాలికపై బేగంపేటలో ఉండే <<15997705>>సంతోష్(బిహార్ వాసి)<<>> అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు. ఈ ఫిర్యాదుతో పోక్సో కేసు కింద అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుపై పూర్తి నివేదిక పంపాలని తాజాగా DGP, RPF డీజీని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కార్ కోరారు.
Similar News
News April 12, 2025
బెల్లంపల్లి: ఇంట్లో గంజాయి పెంపకం.. వ్యక్తి అరెస్ట్: SHO

ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ SHO దేవయ్య తెలిపారు. బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన దేవి రాహుల్కు గంజాయి తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోతన ఇంటి ఆవరణలో రెండు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. మొక్కలను స్వాధీనం చేసుకొని రాహుల్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News April 12, 2025
MDK: రాజీవ్ యువ వికాసం.. ఈనెల 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. శుక్రవారం వరకు మెదక్ జిల్లాలో 16వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14 వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
News April 12, 2025
త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ?

విభజన సమస్యల్ని పరిష్కరించుకునేందుకు గాను తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలోనే సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. AP CM చంద్రబాబు దీనికి సంబంధించి మొదటి అడుగు వేసే ఆలోచనలో ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. చంద్రబాబు, రేవంత్ గత ఏడాది జులైలో ప్రజాభవన్లో తొలిసారి సమావేశమైనా చాలా సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. వాటన్నింటిపై ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.