News June 10, 2024
సిక్కోలుకు 4వసారి కేంద్ర మంత్రి పదవి
సిక్కోలు జిల్లా నేతలకు నాల్గవసారి కేంద్ర మంత్రి పదవి లభించింది. 1952లో పాతపట్నం పార్లమెంట్ స్థానం నుంచి వరహగిరి వెంకటగిరి గెలిచి జవహర్లాల్ నెహ్రూ కేబినెట్లో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా చేశారు. 1996లో కింజరాపు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పని చేశారు. 2012లో కిల్లి కృపారాణి కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా రామ్మోహన్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.
Similar News
News September 30, 2024
SKLM: ఈసీసీఈ డిప్లొమా కోర్సుల ప్రవేశాల దరఖాస్తుకు నేడే లాస్ట్
ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు నెలల డిప్లొమా కోర్సు ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)లో దరఖాస్తు సోమవారంతో ముగియనుంది. ఈ సందర్భంగా అభ్యర్థులు www.brau.edu.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని, రూ.250 ఫీజు చెల్లించాలని రిజిస్ట్రార్ పి.సుజాత తెలిపారు. అనంతరం పూర్తి వివరాలు కోసం విద్యా విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.
News September 30, 2024
జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి
జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.
News September 30, 2024
జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి
జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.