News June 30, 2024

సిద్దవటం: ‘కొన్ని మీడియా గ్రూపుల్లో వస్తున్న వార్త అవాస్తవం’

image

సిద్దవటం మండలం వెలుగు పల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత పులి తిరుగుతున్నట్లు కొన్ని మీడియా గ్రూపుల్లో వస్తున్న వార్త కథలు అవాస్తవమని సిద్దవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి అన్నారు. ప్రతిరోజు మా సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా అన్నీ గమనిస్తున్నారని, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. చిరుత తిరుగుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కళావతి అన్నారు.

Similar News

News October 8, 2024

మైదుకూరు: కాలువలో పడి బాలుడి మృతి

image

మైదుకూరు మండలం విశ్వనాథపురంలో కొట్టం సుజిత్ (14) అనే బాలుడు కాలవలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన సుజిత్ గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News October 8, 2024

కడప: ఆన్ లైన్ గేమ్.. యువకుడి ఆత్మహత్య

image

కడప జిల్లాలో ఆన్‌‌లైన్ గేమ్‌లో నగదు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బంధువుల వివరాల ప్రకారం.. చక్రాయపేట మండలం బీ‌ఎన్ తాండాకు చెందిన కార్తీక్ నాయక్ గత కొంత కాలంగా అన్ లైన్ గేమ్ ద్వారా రూ.3 లక్షలు పొగుట్టుకున్నాడు. 2 రోజుల క్రితం కాలేటి వాగులో ఒక చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఇవాళ స్థానికులు గమనించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

News October 8, 2024

‘వైఎస్సార్ జిల్లా పేరును మార్చడం తగదు’

image

వైఎస్సార్ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నించడం తగదని వైసీపీ జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆ సేవలకు గుర్తింపుగానే ఆయన పేరు పెట్టారన్నారు. కడప జిల్లాగా పేరు మార్చాలని పక్క జిల్లాకు చెందిన మంత్రి సీఎంకు లేఖ రాయడం హేయమైన చర్య అన్నారు.