News February 26, 2025
సిద్దిపేట: 10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో మంగళవారం జరిగింది. సిద్దిపేట కోహెడ మండలం వరికోలుకు చెందిన అనూష భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు ఇష్టంలేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈనెల 14న నిశ్చితార్థం కాగా మార్చి 6న పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో అనూష అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Similar News
News February 26, 2025
కాకినాడ: రేపు అన్ని పాఠశాలలకు సెలవు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా 27వ తేదీ గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ షామ్మోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా పాఠశాలలు తెరిచినట్లయితే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఈవో పర్యవేక్షణ చేయాలని సూచించారు.
News February 26, 2025
సూర్యాపేట: సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ

NLG, KMM, WGL శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సూర్యాపేట జిల్లా సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ బుధవారం సందర్శించారు. సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
News February 26, 2025
బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం చేనేత పట్టు వస్త్రాలను బహూకరించారు. ప్రతిఏటా ఆనవాయితీగా సారెను సమర్పిస్తున్నారు. ప్రధాన కైంకర్యపరులుగా ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు చిల్లపల్లి శ్రీనివాసరావు, గౌరీ, గుత్తికొండ ధనుంజయరావు,విజయ దంపతులు వ్యవహరించారు. ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి రత్నరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.