News February 28, 2025
సిద్దిపేట: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రులు 11.39శాతం, టీచర్ల ఓటింగ్ 8.36 శాతం పెరిగింది.
Similar News
News February 28, 2025
రాష్ట్ర పండుగగా అనకాపల్లి నూకాంబిక జాతర..!

అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబును ఎంపీ సీఎం రమేశ్తో కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. దీనిపై సీఎం రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయాలని కార్యదర్శిని ఆదేశించినట్లు రామకృష్ణ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News February 28, 2025
గోదావరిలో గల్లంతైన యవకులు మృతి

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. అయితే గల్లంతయిన ఇద్దరు యువకులు మృతి చెందారు.జ వారి మృతదేహాలను గజఈతగాళ్లు వెలికి తీశారు. మృతులు పవన్(20), హరి ప్రసాద్(18) గా పోలీసులు గుర్తించారు.
News February 28, 2025
ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్: శ్రీధర్బాబు

తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కులను మహిళల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ఈ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఫిక్కీలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రైజెస్ సదస్సులో వెల్లడించారు.