News April 13, 2025

సిద్దిపేట: అదుపుతప్పిన కారు.. బాలుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన కుకునూరుపల్లి మండల పరిధి లకుడారం గ్రామ శివారులో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన రాయవరం బాబి కుటుంబ సమేతంగా వేములవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా లకుడారం శివారులో మల్లన్నవనం సమీపంలోని రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పి పల్టీలుకొట్టి బోర్లాపడింది. ఫలితంగా కార్తీక్(7) మరణించగా మిగతా నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు.

Similar News

News April 15, 2025

లా కమిషన్ ఛైర్మన్‌గా దినేశ్ మహేశ్వరి

image

సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి 23వ లా కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హితేశ్ జైన్, DP వర్మను సభ్యులుగా నియమించింది. 2027 ఆగస్టు 31వరకు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు.

News April 15, 2025

నిబద్ధతతో పని చేయాలి: MHBD ఎస్పీ

image

పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే నిబద్ధతతో పని చేయాలని MHBD ఎస్పీ రామ్నాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్‌లో కోర్టు డ్యూటీ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. కోర్టు డ్యూటీలో నిర్లక్ష్యం వహించకూడదని, కేసు ఛార్జి షీట్లను నిర్దేశిత కాలంలో న్యాయస్థానాలకు సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

News April 15, 2025

డబ్బులేక రోడ్డు పక్కనే పడుకునేవాడిని: షారుఖ్

image

కెరీర్ తొలినాళ్లలో ముంబైలో అద్దె కట్టేందుకు కూడా డబ్బు లేక రోడ్డు పక్కన పడుకునేవాడినని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మనిషికి ఇల్లు, చదువు ఉంటే ప్రపంచం చేతిలో ఉన్నట్లే. ఉద్యోగం, డబ్బు లేకపోయినా ఫర్వాలేదు కానీ నిద్రపోవడానికి, బాధగా ఉన్నప్పుడు కూర్చుని ఏడవడానికి ఓ నీడ కచ్చితంగా ఉండాలి. నా పిల్లలకు నా పరిస్థితి ఉండకూడదని ముందుగానే ఇల్లు కట్టుకున్నాను’ అని తెలిపారు.

error: Content is protected !!