News April 18, 2025

సిద్దిపేట: కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఆరో తరగతి విద్యార్ధి సాయి ప్రణీత్(12) మృతి చెందిన ఘటన తోగుట మండలం తుక్కాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామంలోని దేవాలయంలో జరిగే ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ పోల్‌ను అనుకోకుండా తగలడంతో సాయి ప్రణీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి స్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 20, 2025

చంద్రబాబుకు YS జగన్ బర్త్‌డే విషెస్

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ CM వైఎస్ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని Xలో పోస్ట్ చేశారు. అటు కేంద్రమంత్రులు, మంత్రులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

News April 20, 2025

వై.రామవరం: ఆ చెట్టుకు ఆకులు కంటే కాయలే ఎక్కువ

image

ప్రకృతి అందాలతో కళకళలాడే అల్లూరి జిల్లా పలు వింతలకు నిలయం. వై.రామవరం మండలం గుమ్మరిపాలెం సమీపంలో అడవికి దగ్గరగా ఉన్న ఈ మామిడి చెట్టు అప్రాంతాన్ని వెళ్లే వారిని ఆకట్టుకుంటుంది. ఆకులు కంటే కాయలే ఎక్కువగా కనిపించడంతో ఆ చెట్టును చూడకుండా ఉండలేరు. గుత్తులు గుత్తులుగా వందలాది కాయలతో దర్శనం ఇస్తోంది. పండు చిన్నది అయినా చాలా తీయగా, రుచిగా ఉంటుందని స్థానికులు తెలిపారు.

News April 20, 2025

పెద్దపల్లి: హిందువులంతా ఏకమై ఉద్యమిస్తాం: విశ్వహిందూ పరిషత్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. హిందువులపై దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హిందూ సమాజాన్ని ఏకం చేసి ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.

error: Content is protected !!