News February 23, 2025

సిద్దిపేట: నేడే గురుకుల పరీక్ష

image

తెలంగాణలోని వివిధ గురుకులాలలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే TG-CET-2025 ప్రవేశ పరీక్షకు సిద్దిపేట జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్యాడ్‌తో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్ కార్డ్, పాస్ ఫోటోలతో రావాలని సూచించారు. ఉదయం 11 నుంచి 1 వరకు జరిగే పరీక్షలకు ఉదయం 9 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News February 23, 2025

నర్సీపట్నం: బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు 

image

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల ఏర్పాటుపై ఆదివారం శాసనసభ ప్రాంగణంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్ పనులను పరిశీలించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.

News February 23, 2025

WNP: ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. జిల్లాలో 12 ఇసుక రీచ్‌లు ఉన్నాయని అన్నారు. జిల్లాలో ఇసుక అవసరం ఉన్న వారు మన ఇసుక వాహనం ద్వారానే తీసుకోవాలని దళారులను ఎవరూ ఆశ్రయించొద్దని సూచించారు. ఇసుకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఐడీఓసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 08545-233525కు కాల్ చేసి తెలపాలని అన్నారు.

News February 23, 2025

ఆయన రెండు దశాబ్దాలు విపక్ష నేతగా ఉండాలి: మంత్రి

image

AP: మాజీ సీఎం జగన్ రేపు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో మంత్రి సుభాష్ పరోక్షంగా స్పందించారు. ‘CMగా ఎలాగో ఘోరంగా విఫలమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని ప్రజా తీర్పు అందుకున్నారు. MLAగా అయినా సభా మర్యాదలు పాటిస్తూ సఫలం అవ్వాలని కోరుకుంటున్నాం. బాధ్యత గల విపక్ష నేతగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ రెండు దశాబ్దాలు మంచి విపక్ష నేతగా పేరు సంపాదించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!