News January 29, 2025
సిద్దిపేట: పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్కు సన్మానం

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఎస్.వి.శ్రీకాంత్కు ప్రజా సంఘాలు ఘనంగా సన్మానం చేశాయి. బుధవారం డీబీఎఫ్ అధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. 50 ఏళ్ల PDSU ఉద్యమ చరిత్రలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా మొదటిసారి శ్రీకాంత్ ఎన్నికయ్యారని అన్నారు.
Similar News
News March 13, 2025
8 ఏళ్లలోపు పిల్లలు ఈ ఐస్క్రీమ్ తినొద్దు: UK సైంటిస్టులు

రంగులు కలిపే ముద్ద ఐస్లను పిల్లలు ఎంతో ఇష్టంగా సేవిస్తుంటారు. అయితే, గ్లిజరాల్ కలిగిన ఈ స్లష్ ఐస్ను 8ఏళ్ల లోపు చిన్నారులు తినడం ప్రమాదకరమని UK పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశోధనలో పిల్లలు స్లషీ ఐస్ సేవించిన వెంటనే అస్వస్థతకు గురవడంతో అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చిందని తెలిపారు. గ్లిజరాల్ వల్ల పిల్లలు స్పృహ కోల్పోతున్నారన్నారు. 8-11ఏళ్లలోపు పిల్లలు ఎప్పుడైనా ఒకటి తినొచ్చని సూచించారు.
News March 13, 2025
MNCL: క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి: CP

క్రమశిక్షణ నిబద్ధతతో కష్టపడి సరైన మార్గంలో విధులు నిర్వహించినప్పుడు గుర్తింపు వస్తుందని CP అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల జోన్ పరిధిలో పనిచేస్తున్న SIలతో CP సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్క అధికారి వ్యక్తిగత జీవితానికి, సిబ్బంది జీవితాలకు విలువనివ్వాలన్నారు. సిబ్బందితో మాట్లాడి దర్బారు వంటివి నిర్వహిస్తూ సమస్యలు ఉంటే వారికి పెద్ద లాగా ఉండి పరిష్కరించాలని సూచించారు.
News March 13, 2025
పాడేరు: రేపు ‘మీకోసం’ కార్యక్రమం రద్దు

ఈనెల 14వ తేదీ శుక్రవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘మీకోసం’ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం హోలీ పండుగ ప్రభుత్వ సెలవు దినం పురస్కరించుకుని ‘మీకోసం’ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ‘మీకోసం’ రద్దయిన సందర్భంగా స్థానిక, స్థానికేతర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ శుక్రవారం‘మీకోసం’ కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ సూచించారు.