News March 23, 2025

సిద్దిపేట: ఫిబ్రవరి 9న సౌదీలో మృతి.. నేడు అంత్యక్రియలు

image

సౌదీ అరేబియాకు బతుకు దేరువు నిమిత్తం కోహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన జాలిగం అశోక్ వెళ్లగా ఫిబ్రవరి 9న ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతదేహం స్వగ్రామం చేరడానికి కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను వేడుకున్నారు. సౌదీ అరేబియా ఎంబసీ అధికారులతో ఎంపీ మాట్లాడి శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. శనివారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

Similar News

News March 26, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 26, 2025

‘విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు కృషిచేయాలి’

image

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ సిటీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా కృషి చేయాలని చెప్పారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సమావేశంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

News March 26, 2025

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు: మంత్రి పొన్నం

image

వాహనదారులకు మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూర్స్ కచ్చితంగా పటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తామన్నారు. ఆ తర్వాత వాటిని ఏన్నటికీ పునరుద్ధరించమని అన్నారు.

error: Content is protected !!